Sunday, September 14, 2014

రాజమౌళి... ప్రచార కేళి!


రాజమౌళి... ప్రచార కేళి!
సినిమా తీయడమే కాదు దాన్ని ప్రమోట్ చేయడంలోనూ దర్శకుడు రాజమౌళి స్టయిలే వేరు. తాను తెరకెక్కించిన సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి రేపేందుకు వైవిధ్య ప్రచారశైలి అనుసరించడం రాజమౌళి ప్రత్యేకత. గతంలో తాను రూపొందించిన అన్ని సినిమాల ప్రచారం విషయంలో ఇదే పంథా అనుసరించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' కోసం ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాలు రచిస్తున్నాడీ సక్సెస్ డైరెక్టర్.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదల చేసిన జక్కన్న మరో వెరైటీ ప్రమోషన్ కు సిద్దమయ్యారన్నది చిత్రనగరి సమాచారం. మహాబలేశ్వర్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత బాహుబలి చిత్ర యూనిట్ కు బ్రేక్‌ ఇచ్చాడీ సినిమా జక్కన్న. ఈ గ్యాప్‌లో బాహుబలి పబ్లిసిటీ కోసం 'క్రికెట్' ఆడిచేందుకు రాజమౌళి పథక రచన చేస్తున్నారని అంటున్నారని ఫిల్మ్‌నగర్‌ వాసులు.

ఫిలింనగర్ లో సమాచారం ప్రకారం ప్రభాస్, రానాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ ని ప్లాన్‌ చేస్తున్నాడట ఈ దర్శకధీరుడు. టాలీవుడ్ లోని యువ నటీనటులతో రెండు టీమ్స్ ను తయారు చేసి ఒకటి బాహుబలి టీమ్ గా, మరో జట్టును బల్లాల దేవ టీమ్ గా బరిలోకి దించనున్నాడు. ఈ రెండు జట్ల మధ్య లిమిటెడ్ ఓవర్ క్రికెట్ మ్యాచ్‌ని ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో చాంపియన్స్ ట్రోఫి జరగనుంది. ఈ నేపథ్యంలో యూత్ ను కమ్ముకున్న క్రికెట్ ఫీవర్ ను క్యాష్ చేసుకునేందుకు రాజమౌళి ఈ వ్యూహం రచించాడట.సినిమాను శిల్పంలా మలచడంలోనే కాదు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలోనూ రాజమౌళి వినూత్నంగా ముందుకెళుతున్నాడు.

Tuesday, September 2, 2014

ప్రభాస్ కోసం మహేష్ బాబుకు మస్కా కొట్టింది!

 మహేష్ బాబు నటించిన 'ఆగుడు' మూవీ ఆడియో వేడుక ఆగస్టు 30న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకకు హాజరు కావాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన హీరోయిన్ తమన్నా గైర్హాజరైంది. ఈ విషయం సినీ సర్కిల్‌లో చర్చనీయాంశం అయింది. విషయం ఆరా తీస్తే....తమన్నా గైర్హాజరు వెనక ప్రభాస్ ఉన్నాడని తేలింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'లో ప్రభాస్ సరసన తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'బాహుబలి' షూటింగ్ మహాబలేశ్వర్‌లో జరుగుతోంది. దీంతో 'ఆగడు' ఆడియో వేడుకకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. సో...అలా ప్రభాస్ సినిమాలో నటించడం కోసం మహేస్ బాబు 'ఆగడు' ఆడియో వేడుకకు మస్కా కొట్టింది తమన్నా.
ప్రభాస్ కోసం మహేష్ బాబుకు మస్కా కొట్టింది!
ఆగడు సినిమా విషయానికొస్తే....'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.