Tuesday, February 10, 2015

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఏడాది 2 సినిమాలతో..

Share on facebook

Share on twitterMore Sharing Service
s
prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త. ఈ ఏడాది డబుల్ ధమాకాతో ప్రభాస్ ముందుకు రాబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మరో సినిమా చేసేందుకు సన్నద్ధమయ్యాడు. తదుపరి చిత్రాన్ని సుజిత్‌తో చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు సమాచారం. 
 
2013లో వచ్చిన మిర్చి సినిమా తరువాత ప్రభాస్ ది చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రభాస్‌కు మిర్చిలాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని ఇచ్చిన యువి బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముహర్తం కూడా ఈ నెలలోనే ఖరారు కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తారాగణం వివరాలు వెల్లడించలేదు.
 
రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్లుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధం అవుతుండడంతో ప్రభాస్  కొత్త సినిమాపై దృష్టి పెట్టాడు. అయితే బాహుబలి విడుదల తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాహుబలి సినిమా తొలి భాగాన్ని 2015 సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.