Wednesday, April 30, 2014

బాహుబలి తర్వాత ప్రభాస్ ఉగ్రం ?




వేరే ఏ బాషలోనైనా ఏదైనా సినిమా విజయం సాధిస్తే ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇతర బాషా సినిమాల దర్శక, నిర్మాతలు, హీరోలు పోటీ పడటం సాధారణ విషయమే. ఇపుడు మన తెలుగు టాప్ హీరోలు కూడా ఓ కన్నడ సినిమా గురించి పోటీ పడుతున్నారు.
ఇటీవలే కన్నడ బాషలో "ఉగ్రం" అనే చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని టాలీవుడ్ దర్శక,నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడని తెలిసింది. ఈ రీమేక్ లో హీరోగా ప్రభాస్ నటించనున్నాడని తెలిసింది. ప్రస్తుతం "బాహుబలి" చిత్ర షూటింగ్ లోఉన్న ప్రభాస్ ఈ చిత్రం తర్వాత కన్నడ రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. ఈ రీమేక్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Tuesday, April 29, 2014

Dil Raju makes movie with Prabhas !

Dil Raju makes movie  with Prabhas !
Creative and Noted producer Dil Raju is now wanted to team up with rebel star Prabhas in the forthcoming remake of Ugram starring Hari Priya. It is known fact that Dil Raju has bagged the rights of the Ugram movie and wants Prabhas to act in the movie. Earlier Young Tiger Jr.NTR and Stylish hero Allu Arjun showed the interest in the movie but could not but Prabhas got the chance. Now it is the movie of Dil Raju and Prabhas movie already the movie is going to remake in Hindi with Bollywood hero Salman Khan.

Monday, April 7, 2014

బాహుబలి యుద్ధం పుర్తయింది !


రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. గత రెండు నెలలుగా ఈ చిత్ర యూనిట్ బాగా కష్టపడుతుంది. ఉదయం ఐదున్నర కు సెట్ కి రావాలి. సాయంత్రం ఆరు గంటలకు వరకు యుద్ధం చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అగ్ర నటుల వరకు అందరికీ ఇదే పని. మొత్తంగా రెండు వేళా మంది ఆర్టిస్టులపై రెండు నెలలుగా యుద్ద సన్నివేశాలు రుపొందిస్తున్నారట. రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న సన్నివేశాలు ఇవేనట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఆ షెడ్యుల్ పూర్తయిందని రాజమౌళి ట్విట్ చేశారు. వైజాగ్ నుంచి వచ్చిన జిమ్ బాయ్స్ కి రాజమౌళి ప్రత్యేకంగా క్రుతజ్ఞాతలు చెప్పారు. వాళ్ళు లేకపోతె మేము ఏమి చేసేవాళ్ళం కాదని అన్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వచ్చి వాళ్ళ మేకప్ వాళ్ళే వేసుకొని కష్టపడ్డారని అన్నారు రాజమౌళి దాదాపు 15౦ కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రభాస్ రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క తమన్నా హీరోయిన్లు. అర్కామీడియా పతాకంపై కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.