Monday, April 7, 2014

బాహుబలి యుద్ధం పుర్తయింది !


రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. గత రెండు నెలలుగా ఈ చిత్ర యూనిట్ బాగా కష్టపడుతుంది. ఉదయం ఐదున్నర కు సెట్ కి రావాలి. సాయంత్రం ఆరు గంటలకు వరకు యుద్ధం చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అగ్ర నటుల వరకు అందరికీ ఇదే పని. మొత్తంగా రెండు వేళా మంది ఆర్టిస్టులపై రెండు నెలలుగా యుద్ద సన్నివేశాలు రుపొందిస్తున్నారట. రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న సన్నివేశాలు ఇవేనట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఆ షెడ్యుల్ పూర్తయిందని రాజమౌళి ట్విట్ చేశారు. వైజాగ్ నుంచి వచ్చిన జిమ్ బాయ్స్ కి రాజమౌళి ప్రత్యేకంగా క్రుతజ్ఞాతలు చెప్పారు. వాళ్ళు లేకపోతె మేము ఏమి చేసేవాళ్ళం కాదని అన్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వచ్చి వాళ్ళ మేకప్ వాళ్ళే వేసుకొని కష్టపడ్డారని అన్నారు రాజమౌళి దాదాపు 15౦ కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రభాస్ రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క తమన్నా హీరోయిన్లు. అర్కామీడియా పతాకంపై కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment