Saturday, December 6, 2014

బాలీవుడ్ వెళ్తున్న ప్రభాస్


ప్రభాస్ మిర్చి సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండడంతో ప్రభాస్ నటిస్తున్న బాహుబలి సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని కుర్చుతున్నారు. అయితే ప్రభాస్ చడీ చప్పుడు లేకుండా ప్రభాస్ నిన్న బాలీవుడ్లో విడుదలయిన సినిమాలో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. నిన్న శుక్రవారం నాడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన యాక్షన్ జాక్సన్ సినిమాలో సోనాక్షి తో ఓ పాటలో కొన్ని క్షణాలపాటు కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.

తెలుగులో మహేష్ నటించిన దూకుడు సినిమాకి ఇది రీమేక్ గా తీసిన ఈ సినిమాని ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్ , సోనాక్షి , అమీ గౌతమ్ నటించిన ఈ సినిమాలోని ఓ పాటలో ప్రభాస్ కనిపించడం బట్టి చూస్తే…బాలీవుడ్లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. అన్నీ కుదిరితే బహుశా భవిష్యత్తులో ప్రభాస్ నటించబోయే తోలి సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా ప్రభాస్ ని వెండితెరపై చూడాలని తహతహలాడుతున్న ప్రభాస్ అభిమానులు యాక్షన్ జాక్సన్ సినిమాలో అతన్ని చూసి తృప్తిని పొందొచ్చు.

No comments:

Post a Comment