Monday, November 30, 2015

ప్రభాస్ దందా చేస్తాడా?! హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ కృష్ణం రాజుల దందా!

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వివాదాలకు దూరంగా ఉండటమే కాకుండా చాలా మంచి వ్యక్తి అని అయన గురించి తెలిసిన వారు అంతా అంటూ ఉంటారు. అయితే వీరిద్దరు టాలీవుడ్ లో చేస్తున్న ‘దందా’ గురించి చాల ఆశక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ బ్యానర్ ఇటీవల ‘దందా’ అనే టైటిల్ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయడం చాల మందిని ఆశ్చర్య పరిచింది. 

ఆ మధ్య కృష్ణంరాజు ప్రభాస్ తో ‘ఒక్క అడుగు’ అన్న పేరుతో ఒక సినిమా తీస్తాడని అదేవిధంగా ‘బాహుబలి’ తరువాత ‘భక్తకన్నప్ప’ సినిమాను తీస్తాడని అంటూ ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేసాయి. ఒక దశలో ఈ వార్తలు నిజమే అన్నట్లుగా కృష్ణంరాజు సంకేతాలు కూడ ఇచ్చాడు. అయితే ఆ తరువాత ఈ వార్తలను ప్రభాస్ ఖండించాడు. ఈ విషయం తరువాత కృష్ణంరాజు మౌనంగా ఉన్నాడు. 

అయితే ఇప్పుడు మళ్ళీ కృష్ణంరాజు యూటర్న్ తీసుకుని తన సొంత నిర్మాణ సంస్థ పేరు పై ఈ ‘దందా’ అన్న టైటిల్ ఎందుకు రిజిస్టర్ చేసాడు అంటూ ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి 2’ కు రెడీ అవుతూ మరో సంవత్సరం వరకు ‘బాహుబలి’ మే తన ప్రపంచంగా జీవిస్తాడు. ఇలాంటి పరిస్థుతులలో కృష్ణంరాజు మరి ఏ హీరోతో ఈ సినిమాను తీస్తాడు అన్న విషయం సస్పెన్స్ గా మారింది.  

అయితే ఇది ఇలా ఉండగా ప్రభాస్ తన సన్నిహితుల చేత ప్రారంభించిన యువీ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా కొంతమంది యంగ్ హీరోలతో సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడు. 
ఈ పరిస్థుతుల నేపధ్యంలో కృష్ణంరాజు కూడ ప్రభాస్ మార్గాన్నే అనుసరిస్తూ ఈ ‘దందా’ టైటిల్ తో ఒక యంగ్ హీరోతో సినిమా తీస్తాడా అనే అనుమానాలు కూడ ఉన్నాయి. పక్కా మాస్ లుక్ ఉన్న ఈ టైటిల్ తో కృష్ణంరాజు ఈ వయస్సులో ప్రభాస్ సహాయం లేకుండా అటువంటి ప్రయోగాలు చేస్తాడా అనే దిశలో కూడ వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా కృష్ణంరాజు ‘దందా’ ఈరోజు ఫిలింనగర్ లో హాట్ టాపిక్.. 

Tuesday, November 17, 2015

బాహుబలి 3 పై విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘బాహబలి’ ప్రపంచం గర్వించ దగ్గ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు అహర్శిశలూ కష్టపడితీసిన చిత్రం. తెలుగు చలన చిత్ర సీమలో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించింది. ఇక రూ.600 కోట్లు వసూళ్లు చేసి భారతీయ చిత్రాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ‘బాహుబలి 2’ త్వరాలో సెట్స్ మీదకు రాబోతుంది..ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు రాజమౌళి.

బాహుబలి పార్ట్ -3 గురించి దర్శకధీరుడు రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యచేశారు.  ఇప్పటి వరకు బాహుబలి కోట్లాది ప్రజలను ఆకర్షించింది. తాను ఈ కథకు రైటర్ గా ఉండటం అదృష్టమని అన్నారు. అయితే బాహుబలి 2 తో పాటు బాహుబలి 3 కూడా ఉంటుందని అన్నారు. కాకపోతే బాహుబలి, బాహుబలి 2 కి ఏ మాత్రం సంబంధం లేని కథతో ఇది ఉంటుందని వివరించారు. బాహుబలి కన్క్లూజన్ లో పార్ట్-1 లో మిగిల్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆయన అన్నారు.

బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో బాహుబలి 2 పై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారని ఈ సినిమా మరిన్ని క్యారెక్టర్లతో అద్భుతంగా అందరినీ అలరిస్తుందని అన్నారు.   సినిమాలకు స్క్రిప్ట్ ను అందించడం నా బాధ్యత  ప్రస్తుతం 40 స్క్రిప్టులు రెడీ చేస్తున్నాను. ఇక పోతే తాను ఇలాంటి కథలు రాస్తూనే ఉంటానని అందులో కొన్ని మాత్రమే వెండితెరకు పరిచయం అవుతాయని అన్నారు. 

Monday, November 16, 2015

మరొక ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ‘బాహుబలి’

Bahubali Posters (1)


రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన చిత్రం ‘బాహుబలి’.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.ఈ చిత్రం చాలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంది.బుసాన్, తల్లిన్ లోని ఆడియన్స్ ని మెప్పించి అక్కడ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంది.ఇప్పుడు ఈ చిత్రం యూఎస్ఏ లో హోనోలులు లోని హవాయి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది.
ఈ చిత్రం ఈ గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం పక్కన పెడితే ఈ చిత్రం చైనా , జపాన్ , సౌత్ ఈస్ట్ ఆసియన్ , లాటిన్ అమెరికా దేశాల్లో డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది.ఈ చిత్ర రెండవ వెర్షన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకోబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.2017 లో ‘బాహుబలి 2′ చిత్రం విడుదల కాబోతుంది.’బాహుబలి 2′ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతుంది.