Sunday, April 2, 2017

బాహుబలి-2 ఆ థర్టీ మినిట్స్ పీక్స్..!


సిని ప్రియులంతా ఎదురుచూస్తున్న రాజమౌళి సృష్టించిన బహుబలి-2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిగినింగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో రెండో పార్ట్ అంతకుమించి రికార్డులను షురూ చేసేందుకు వస్తుంది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన జక్కన్న సినిమా మీద అంచనాలను పెంచేలా చేస్తున్నాడు.  
ఇక రాజమౌళి మాటల్లోనే బాహుబలి-2 లో బాహుబలి, భళ్లాలదేవలతో పాటుగా శివగామి, దేవసేన పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయట. ఈ రెండు పాత్రలను సృష్టించిన విధానం చాలా బాగుంటుందని.. ఇద్దరి మధ్య ఓ థర్టీ మినిట్స్ సీన్స్ ఉంటాయని అవి సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయని అంటున్నాడు రాజమౌళి.

తెలుగు సినిమాగా వచ్చిన బాహుబలి ఈ సెకండ్ పార్ట్ కు ఇండియన్ సినిమా అంటూ ప్రమోట్ చేస్తుండటం విశేషం. దాదాపు సినిమా కోసం ఐదేళ్లు కష్టపడి పనిచేసిన చిత్రయూనిట్ ప్రతిభ సినిమాలో కనిపించనుంది. అనుష్క దేవసేనగా మొదటి పార్ట్ లో కేవలం ఓల్డ్ గెటప్ లోనే చూశారు. కాని అసలు సిసలైన అందాల దేవసేనను పార్ట్ 2లో చూస్తారని అంటున్నారు.  
శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క నటించారు. ఇక మొదటి పార్ట్ మొత్తం పాత్రల పరిచయంతోనే సరిపెట్టిన జక్కన్న అసలైన కథ సెకండ్ పార్ట్ లోనే పెట్టాడట. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో అదే రేంజ్లో రిలీజ్ అవబోతున్న బాహుబలి-2 ఎన్ని ప్రభంజనాలను సృష్టిస్తుందో చూడాలి. 

No comments:

Post a Comment