Thursday, January 17, 2013

మిర్చి రెడీ అయ్యినది.

ప్రభాస్ హీరో గా అనుష్క రీచాగంగోపద్యాయ హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 'మిర్చి'. ఈ సినిమాకు సంబందించిన ఆడియో ఈ నెల 5 న విడుదలై మంచి ప్రజాదరణ పొందినది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకి సిద్దమైనది. పిబ్రవరిలో రానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నది. ఈ సినిమా పల్నాడు నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉంటె ప్రభాస్ తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో రానున్న సంగతి తెలిసినదే. ఆ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుగుతుందని తెలిసినది.

No comments:

Post a Comment