Wednesday, December 25, 2013

'బాహుబలి'..యుద్ధం మొదలైంది..


  ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తున్న చిత్రం 'బాహుబలి'. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఇండస్ట్రీలోనే తొలి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనిలో మరో సన్నివేశాలు కూడా భారీగానే ఉండబోతున్నాయి. దీనిలో భాగంగా మగధీరలో ఉన్నట్లు దీనిలో కూడా ఓ భారీ యుద్ధం ఉండబోతుంది.

   ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ తాజాగా మొదలైనట్లు సమాచారం. హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ ఇందుకు వేదికయ్యాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా తదితర ప్రధాన తారాగణంతో బాటు, రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ చిత్రీకరణలో అంటే యుద్ధంలో పాల్గొంటున్నారు. వీరందరికీ గత నెల రోజులుగా కఠినమైన శిక్షణ కూడా ఇచ్చారు. మార్చి నెలాఖరు వరకు ఈ వార్ ఎపిసోడ్ చిత్రీకరణ సాగుతుందంటే ... ఇవి ఏ స్థాయిలో ఉంటాయో ఆలోచించవచ్చు! ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్స్ నేతృత్వంలో ఈ చిత్రీకరణ జరుగుతోంది!

   ఇక ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ను బట్టి, బాహుబలిని బల్లలదేవ బంధిస్తాడని.. అతని సింహాసనం పైకి అతని పోలికలతోనే ఉండే శివుడు అనే ఓ మాస్ క్యారెక్టర్ ను ప్రవేశ పెట్టి తనకు అనుకూలంగా పరిపాలన చేయిస్తుంటాడట.. కొన్నాళ్లకు బల్లలదేవుని నిజరూపం తెలుసుకున్న శివుడు.. బాహుబలికి సాయం చేయడం.. తర్వాత ఇద్దరూ కలిసి రాజ్యాన్ని కాపాడుకోవడం అనే కాన్సెప్ట్ తోనే బాహుబలి రాబోతోందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో గానీ .. ప్రధాన పాత్రల మధ్య ఉన్న పోటీ మాత్రం ఆడియన్స్ ను అలరిస్తుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment