Friday, February 21, 2014

చివరి దశలో 'బాహుబలి' యుద్ద సన్నివేశం !



పరాజయం ఎరుగని టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమా కు సంబందించిన ఓ భారీ యుద్ద సన్నివేశం గత కొన్ని నెలలుగా అక్కడ చిత్రీకరణ జరుగుతుంది. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో తెరేక్కుతున్న ఈ యుద్ద సన్నివేశం ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చింది. ప్రభాస్ రానా హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెంథిల్ సాబు సైరిల్ కీరవాణి వంటి దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మరో తెలుగు సినిమా తెరకేక్కించని విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి

No comments:

Post a Comment