Thursday, March 26, 2015

‘బాహుబలి’ ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి!



విలక్షణమైన గొంతుతో బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు సంచలనాలు నమోదు చేస్తున్న గాయకుడు కైలాష్‌ఖేర్‌. ఆయన తెలుగులో పాడిన పాటలన్నీ హిట్స్‌గా నిలిచాయి. ప్రభాస్‌ కిందటి చిత్రం ‘మిర్చి’లో ‘పండుగలా దిగి వచ్చావు...’ అంటూ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే పాటను పాడిన ఆయన ఇటీవల పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రంలో పాడిన పాట కూడా బాగా పాపులర్‌ అయింది. తాజాగా ఆయన రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో కూడా ఓ సెన్సేషనల్‌ సాంగ్‌ పాడాడని, ఈ పాట ‘బాహుబలి’ చిత్రానికే పెద్ద ఎస్సెట్‌ అవుతుందనే నమ్మకంతో రాజమౌళి, కీరవాణిలు ఉన్నారట. వాస్తవానికి ఈ పాటను కీరవాణి ఎంతో కష్టపడి ట్యూన్‌ కట్టి.. ఈ పాటకు కైలాష్‌ఖేర్‌ అయితేనే న్యాయం చేయగలడని భావించి ఆయన చేత పాడిరచాడట.

No comments:

Post a Comment