Thursday, August 30, 2018

భారతంలో అర్జునుడుగా ప్రభాస్?

మిస్టర్ పెర్ఫెక్ట్ వర్సెస్ మిస్టర్ పెర్ఫెక్ట్!  బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వేసిన బిగ్ ట్రాప్లో టాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ప్రభాస్ అడ్డంగా ఇరుక్కోబోతున్నాడా? అంటే అవుననే తాజాగా సమాచారం అందింది. అయితే ప్రభాస్ని ఇరికించే అమీర్ ప్లానేంటో తెలియాలంటే డీప్గా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొంతకాలంగా `మహాభారతం 3డి` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ అంబానీతో కలిసి దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో మహాభారతం సిరీస్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మూడు నుంచి ఐదు భాగాలుగా తెరకెక్కించేందుకు తనకు ఏకంగా పదేళ్ల సమయం పడుతుందని ప్రకటించాడు. 

ఆ క్రమంలోనే ఈ సినిమాలో నటించే కాస్టింగ్ విషయమై ఆసక్తికర చర్చ సాగింది. అమీర్ ఖాన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ దీపిక పదుకొనే వంటి స్టార్లను సంప్రదించారన్న చర్చ సాగింది. అమీర్ కృష్ణుడిగా నటిస్తే దీపిక పదుకొనే ద్రౌపది పాత్ర పోషించనుందని ప్రచారమైంది. ఇప్పుడు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో అర్జునుడు పాత్రలో నటిస్తాడని ప్రచారమవుతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ ప్రచారం మేరకు.. ఇప్పటికే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాహుబలి ప్రభాస్ని సంప్రదించాడని తెలుస్తోంది. వాస్తవానికి గత కొంతకాలంగా మహాభారతం తెరకెక్కుతుందా.. లేదా? అన్న సందిగ్ధత నెలకొందని వార్తలొచ్చాయి. పురాణేతిహాసాలతో ఎన్నో చిక్కులుంటాయి. `పద్మావతి` తెరకెక్కించేప్పుడు భన్సాలీకి ఎదురైనట్టే.. సేమ్ సన్నివేశమే రిపీటైతే అది పెద్ద రిస్క్ అవుతుందని భావించి అమీర్ సైలెంటుగా ఉన్నారని ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మిస్టర్ పెర్ఫెక్ట్ ఈ ప్రాజెక్టు విషయమై రాజీకొచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారట. ఆ క్రమంలోనే కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు అమీర్ అమితాబ్ వంటి స్టార్లు నటించిన `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. 

No comments:

Post a Comment