Thursday, September 6, 2018

ప్రభాస్ అధికారికంగా ప్రకటించేశాడు

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న ‘సాహో’. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘సాహో’ తప్ప మరే ప్రాజెక్ట్ ను ప్రభాస్ సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు. వచ్చే సమ్మర్ లో ‘సాహో’ చిత్రం విడుదల కాబోతుంది. దాదాపు ఏడు సంవత్సరాల్లో కేవలం  ‘బాహుబలి’ మరియు సాహో చిత్రాలకే ప్రభాస్ సమయం అంతా కేటాయించాడు. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘సాహో’ చిత్రం పూర్తి కాకుండానే తదుపరి చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది.
ప్రభాస్ తదుపరి చిత్రం త్రిభాష చిత్రంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తన త్రిభాష చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని - త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంకు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు. గోపీ కృష్ణతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో తనకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా - ఆమెకు ప్రస్తుతం క్రేజ్ అంతగా లేదు. ఆ కారణంగానే పూజాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

Tuesday, September 4, 2018

ప్రభాస్ కోటిచ్చాడు..

కేరళ క‘న్నీటి’ వర్షంలో తడిసిముద్దైన సంగతి తెలిసిందే.. శతాబ్ధకాలంలోనే పెద్ద ఎత్తున ముంచెత్తిన వరదలతో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో మరణించారు. కేరళను ఆదుకోవాలని అక్కడి సీఎం పిలుపునివ్వడంతో ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలను పంపించారు. వివిధ దిగ్గజ సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.
కేరళను ఆదుకోవడంలో సినీ ప్రముఖులు కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు - తమిళం - మలయాళ - హిందీ నటులు ఇతోధికంగా సాయం చేశారు. కానీ ఇతర సినీ స్టార్లతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఆర్థిక విరాళాలు తక్కువే అందించారనే విమర్శ ఉంది. అందరికంటే ముందు తమిళ స్టార్ హీరో బ్రదర్స్ సూర్య-కార్తి సోదరులు రూ.25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా హీరోలు కూడా భారీగానే విరాళాలందించారు.

తాజాగా మలయాళ సినీ స్టార్ల పిసినారితనంపై కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సుందరేశన్ - నటి సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మలయాళ నటులు విరాళాలు పెద్ద ఎత్తున ఇవ్వలేదని వారు మండిపడ్డారు. కోట్ల విలువ చేసే కార్లలో తిరిగే నటులున్న మలయాళ ఇండస్ట్రీలో సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. 

కేరళ మంత్రి సుందరేశన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో గొప్ప నటులున్నారు. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. కానీ లక్షల్లోనే ఇచ్చారు. మలయాళంలో పెద్దగా మార్కెట్ లేని తెలుగు హీరో ప్రభాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. అతడిని చూసి నేర్చుకోండి’ అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. 

అసలు అధికారికంగా ప్రభాస్ విరాళం ఇచ్చాడని తెలుసు కానీ ఎంతిచ్చాడనేది ఎవ్వరికీ తెలియదు.. ఆయన ఫ్యాన్స్ 25 లక్షలు ఇచ్చాడని అనుకున్నారు. ప్రభాస్ కూడా తాను విరాళమిచ్చిన విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు కేరళ మంత్రి... ప్రభాస్ కోటి రూపాయలు ఇచ్చాడని అనడం.. ప్రభాస్ ది గొప్ప మనసు అని కీర్తించడం చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో మంచి చేసి కూడా ప్రచారం చేసుకోలేదంటూ కొనియాడుతున్నారు. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది.