Thursday, September 6, 2018

ప్రభాస్ అధికారికంగా ప్రకటించేశాడు

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న ‘సాహో’. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘సాహో’ తప్ప మరే ప్రాజెక్ట్ ను ప్రభాస్ సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు. వచ్చే సమ్మర్ లో ‘సాహో’ చిత్రం విడుదల కాబోతుంది. దాదాపు ఏడు సంవత్సరాల్లో కేవలం  ‘బాహుబలి’ మరియు సాహో చిత్రాలకే ప్రభాస్ సమయం అంతా కేటాయించాడు. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘సాహో’ చిత్రం పూర్తి కాకుండానే తదుపరి చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది.
ప్రభాస్ తదుపరి చిత్రం త్రిభాష చిత్రంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తన త్రిభాష చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని - త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంకు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు. గోపీ కృష్ణతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో తనకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా - ఆమెకు ప్రస్తుతం క్రేజ్ అంతగా లేదు. ఆ కారణంగానే పూజాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

No comments:

Post a Comment