Thursday, February 7, 2013

మిర్చి టికెట్ల కోసం....




టాలీవుడ్ లో ప్రస్తుతం మిర్చి సినిమా గురించి హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 8 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ నెల 7 రాత్రి నుంచే ఈ సినిమా ప్రత్యేక షోలు  ప్రదర్శిస్తున్నారు. అభిమానులు ఈ టికెట్లకోసం ఎగబడుతున్నారు. ఈ టికెట్ల ధర 1500 నుంచి 2000 రూపాయలు వసూళ్ళు చేస్తున్న తమ అభిమాన హీరో కోసం ఆ ధరను ఏమాత్రం లెక్క చేయకుండా జనం పోటీ పడుతున్నారు. ఈ సినిమా కోసం భీమవరం విశాఖపట్నం నెల్లూరు వరంగల్ వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాదుల్లోనూ ఈ సినిమా టికెట్లకోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఈ సినిమా ప్రిమియర్ షోలు ఇప్పటికే ఫుల్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సినిమాను మల్టీప్లేక్స్ థియేటర్లల్లోనుప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు.
- We LOve PRabhas...

No comments:

Post a Comment