Monday, September 2, 2013

‘బాహుబలి’ మూవీ డైలాగులు లీక్

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం ‘బాహుబలి'. రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈచిత్రంలోని డైలాగులు కొన్ని ఆన్‌లైన్లో లీకయ్యాయి. ‘కొండలు పిండి చేసే సమయం రానీ...కార్య సూరుడు అదరడు, బెదరడు' డైలాగ్‌తో పాటు, ‘నీయందు ఆయుధం, అదేనీ ఆత్మవిశ్వాసం' అనే డైలాగులు ఆన్ లైన్లో దర్శనం ఇస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రాణా, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. ‘బాహుబలి’ మూవీ డైలాగులు లీక్ బాహుబలి తాజాగా ఈచిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ విశేషాలను రాణా వివరిస్తూ.....ఈ షెడ్యూల్ మొత్తం ఓమారథాన్‌లా సాగింది. ఉదయం 7 గంటలకు రాత్రి 10 గంటలకు వరకు షూటింగ్. అర్థరాత్రి వరకు కూడా ట్రైనింగ్ జరిగింది' అంటూ ట్వీట్ చేసాడు. ‘ఒక వారాంతం అయితే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నాన్ స్టాప్‌గా సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటలు పని సాగింది' అని రాణా వెల్లడించారు. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

No comments:

Post a Comment