Friday, November 8, 2013

మలబార్ అడవులకు వెళ్తున్న 'బాహుబలి' టీం !




 
ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . ప్రస్తుతం ఈ సినిమా దృష్టంతా మలబార్ ఫారెస్ట్ పై పడింది. అక్కడ భారీ షెడ్యుల్ ని చిత్రీకరించేందుకు యూనిట్ అక్కడకు వెళ్లనున్నది. దాంతో సినిమా యూనిట్ కేరళ వెళ్లేందుకు సిద్దం అవుతుంది. కర్నూలు షెడ్యుల్ తర్వాత ఏకధాటిగా 'బాహుబలి' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సుదీర్ఘంగా జరిగింది. యాక్షన్ బహుబలుడి నిశ్చితార్థం వంటి అంశాలను ఇక్కడ తెరకెక్కించాడు. సినిమా చిత్రీకరణ కోసం మొక్కజొన్న తోట కూడా సిద్దం చేశారు. కానీ ఆమధ్య కురిసిన వానల వలన ఆ తోట కాస్త పాడైనది. అది మళ్లీ సిద్దం అయ్యేలోపు మలబార్ ఫారెస్ట్ లో షూటింగ్ ని పూర్తి చేయలని బావిస్తున్నట్లు యూనిట్ అంటుంది. అక్కడ హీరో ప్రభాస్ రానా అనుష్కకు సంబందించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2015 లో విడుదల కానున్న ఈ సినిమా రెండు భాగాలుగా చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. అనుష్క పట్టినరోజు కానుకగా గురువారం ఈ సినిమా రెండో మేకింగ్ వీడియో విడుదల కానున్నది.

No comments:

Post a Comment