Monday, August 6, 2012

ప్రభాస్'రెబల్‌'ఆడియో విడుదల తేదీ ఖరారు

ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్‌'. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని ఆగస్టు 28 ఖరారు చేసారు. లారెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో పంక్షన్ గ్రాండ్ గా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పరిశ్రమలోని పెద్దలుతో పాటు ప్రభాస్ తోటి హీరోలు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే ఛీఫ్ గెస్ట్ గా రాజమౌళి,దర్శకుడు కె.రాఘవేంద్రరావు రానున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం కి ట్రేడ్ లో మంచి రేట్లు పలుకుతున్నాయి. పవన్,మహేష్,ఎన్టీఆర్,రామ్ చరణ్ చిత్రాల తరహాలో ఈ చిత్రం బిజినెస్ చాలా క్రేజ్ గా జరుగుతోంది. 'రెబల్‌'లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు.

No comments:

Post a Comment