Thursday, January 30, 2014

అవ‌న్నీ పుకార్లే అంటున్న జ‌క్కన్న!!

అవ‌న్నీ పుకార్లే అంటున్న జ‌క్కన్న!!రాజ‌మౌళి `బాహుబ‌లి`లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు, సునీల్ కూడా ఆ చిత్రంలో ప్రతినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు, 
ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి రాజ‌మౌళి ఓ క‌థ చెప్పాడు, వీరిద్దరి క‌ల‌యిక‌లో త్వర‌లోనే ఓ సినిమా ఉంటుంది. 

 గ‌త కొన్ని రోజులుగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో సాగుతున్న ప్రచారమే ఇదంతా. అయితే ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయ‌త్నం చేశారు రాజ‌మౌళి. ట్విట్టర్ ద్వారా ఆయ‌న చెబుతూ... `బాహుబ‌లి`లో తార‌క్ భాగ‌మ‌య్యార‌న్నది అవాస్తవం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి కూడా నేను క‌థ చెప్పలేదు. సునీల్ `బాహుబ‌లి`లో న‌టిస్తున్నాడ‌న్న మాట కూడా అబ‌ద్ధం. ఇవ‌న్నీ పుకార్లే` అని స్పష్టం చేశారు.  

ప్రస్తుతం `బాహుబ‌లి` చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్‌సిటీలో సాగుతుంది. యుద్ధం నేప‌థ్యంలో స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఫిబ్రవ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు ఆ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌బోతున్నట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని వ‌చ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అయితే ఇంకో ఆర్నెళ్ల లోపు సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తారు. ఆ త‌ర్వాత గ్రాఫిక్స్‌కి సంబంధించిన ప‌నుల‌ను మొద‌లుపెడ‌తారు. ఈ సినిమాకి విజువ‌ల్ ఎఫెక్ట్స్ అందించ‌డానికే ఆర్నెళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.


No comments:

Post a Comment