భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పుర్కారాలు పద్మశ్రీ,పద్మభూషన్, పద్మ విభూషన్. సినీ,క్రీడా,సామాజిక సేవా వివిధ రంగాల్లో సేవ చేసినందుకు గాను వారి సేవలు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించినందుకు గాను ఈ అవార్డులు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో దర్శకధీరుడు రాజమౌళికి అవార్డు వచ్చిందీ అనగానే బాహుబలి చిత్ర యూనిట్ ఎగిరి గంతేసింది. తెలుగు దర్శకుడు అందులోనూ అందరి అభిమానాన్ని సంపాదించిన రాజమౌళికి రావడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో గర్వ పడుతుంది.

మొదటి నుంచి విభిన్నమైన చిత్రాలు తీస్తూ అద్భుతమైన గ్రాఫిక్ టెక్నాలజీతో సినిమాలు తీస్తూ..ఓటమి ఎరుగుని దర్శకుడిగా రాజమౌళి తెలుగు ప్రేక్షకులు గుండెల్లో నిలిచి పోయారు. తాజాగా రాజమౌళికి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనుక ఓ పెద్ద ట్విస్టే ఉందట. వాస్తవానికి ఈ అవార్డు రావడం వెనుక మన తెలుగు రాష్ట్రాల ప్రమేయం ఏమాత్రం లేదట..వాస్తవానికి కళా,క్రీడలకు సేవలందించిన వారి పేర్లు ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంటాయి.


            రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!!
కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళికి మాత్రం పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి ఈ రికమండేషన్ వెళ్లిందట..అలా ఆయనకు అవార్డు దక్కడంలో ఆ రాష్ట్రం ప్రముఖ పాత్ర వహించిందట. ఇక దీనికో కారణం కూడా ఉంది..గతంలో రాజమౌళి కన్నడంలో  ‘కంటీరవ' అనే సినిమా చేశారు. అప్పట్లో ఆ సినిమా బాగా ఆడినా రాజమౌళికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. కానీ ‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.